మద్యం బాటిల్‌ను రూ.50కు ఇస్తే ప్రతి నెలా రూ.6 వేలు ఆదా : సోము వీర్రాజు వివరణ

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (08:30 IST)
తమ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే నాణ్యమైన మద్యాన్ని కేవలం రూ.50కే ఇస్తామన్న బీజేపీ ఏపీ శాఖ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నేత తీవ్రంగా ఖండించారు. చివరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. సీపీఎం ఏపీ శాఖ కార్యదర్శి రామకృష్ణ అయితే, ఏకంగా సోము వీర్రాజు కాస్త సారాయి వీర్రాజుగా మారిపోయారంటూ సెటైర్లు వేశారు. నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సోము వీర్రాజు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. పేదల కష్టాన్ని జగన్ ప్రభుత్వం దోచుకుంటుందని, అందుకనే అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. మద్యం కోసం పేదలు రోజుకు రూ.250 ఖర్చు చేస్తున్నారనీ, ఆ ఖర్చులో రూ.200 తగ్గిస్తే ఆ కుటుంబంపై భారం తగ్గుతుందని, ప్రతి నెలా రూ.6 వేల వరకు ఆదా అవుతుందని వివరించారు. 
 
అలాగే, తనపై విమర్శలు చేసిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. తమ్మినేనికి రాత్రిళ్లు ఎక్కువై ఉదయం నోరు మడతపడుతుందని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఓ మొబైల్ పొలిటీషియన్ అని అన్నారు. మంత్రి కొడాలి నాని చేతికి దారాలు తప్ప తలలో మెదడు లేదంటూ సెటైర్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments