Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీపై బీజేపీ ఫోకస్‌ పెడితే... వైసీపీ నేతల అడ్రస్‌లు గల్లంతవుతాయ్!

ఏపీపై బీజేపీ ఫోకస్‌ పెడితే... వైసీపీ నేతల అడ్రస్‌లు గల్లంతవుతాయ్!
విజ‌య‌వాడ‌ , బుధవారం, 29 డిశెంబరు 2021 (18:33 IST)
ఏపీలో వైసీపీ పతనం ప్రారంభమైందనడానికి ప్రజా ఆగ్రహ సభ విజయవంతం కావడమే నిదర్శనమని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,  బీజేపీపై జాలిగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.


సజ్జల మాటల్లో భయం స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఎవరో మాట్లాడిస్తే,  మాట్లాడాల్సిన దుస్ధితి బీజేపీకి లేదన్నారు. ఏపీపై బీజేపీ ఫోకస్‌ పెడితే వైసీపీ నేతల అడ్రస్‌లు గల్లంతవుతాయని తెలిసే, జాలి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. 
 
 
దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ పాలన సుపరిపాలనకు అద్దం పడితే, జగన్‌ పాలన సుపరిపాలనకు అడ్డంగా మారిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ స్వార్థ రాజకీయాలేనని విమర్శించారు. ప్రజలు విసిగి వేసారిపోయారని, వైసీపీ పతనం మొదలైందని జీవీఎల్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ = బీజేపీ = కాంగ్రెస్ = సీపీఐ = జనసేన; సజ్జ‌ల లెక్క ఇది!