Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా రాష్ట్ర బంద్ : దేవినేని ఈడ్చుకెళ్లి వ్యానులో కుక్కిన పోలీసులు

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (10:46 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపైనే కాదు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై వైసిపి శ్రేణుల దాడికి నిరసనగా ఏపీ బంద్‌కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. దీంతో బుధవారం ఉదయం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అయితే,  వీరిని పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేసి ఠాణాలకు తరలిస్తున్నారు. ఇలా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. 
 
ఈ బంద్‌లో భాగంగా, కృష్ణా జిల్లా గొల్లపూడి సెంటర్‌లో నిరసన తెలియజేయడాని వచ్చిన మాజీమంత్రి దేవినేని ఉమను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. భారీగా మొహరించిన పోలీసులు ఉమ బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనంలో ఎక్కించారు. అయితే, పోలీసు వ్యాన్ ఎక్కకుండా దేవినేని ఉమ తీవ్రంగా ప్రతిఘటించారు. 
 
ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆటవిక, అరాచక పాలన సాగుతోందన్నారు. రాష్ట్ర ప్రజల స్వేచ్చనే కాదు ఇప్పుడు పార్టీల స్వేచ్చను కూడా జగన్ సర్కార్ హరిస్తోందన్నారు. పోలీసులు వైకాపాకి తొత్తులుగా మారిపోయారని ఉమ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కల్కీ' బాక్సాఫీసు టార్గెట్ ఎంతంటే..!!

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ లో డైరెక్టర్ వివి వినాయక్ ఎంట్రీ

సెన్సేషనల్ నిర్ణయం ప్రకటించిన జానీ మాస్టర్

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments