Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్ర నూతన రాజధాని విశాఖపట్టణం : తమ్మినేని సీతారాం

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (16:50 IST)
నవ్యాంధ్ర నూతన రాజధాని విశాఖట్టణం అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గంలోని బూర్జ ప్రాంతంలో ఆయన వివిధ రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చెందడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. 
 
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో కర్నూలులో హైకోర్టును, అమరావతిలో సచివాలయం, హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు అవుతుందని, ఎడ్యుకేషన్‌ హబ్‌గా అమరావతి అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా ఏర్పాటవుతుందని దీనిలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తే మీకు వచ్చే నష్టం ఏమిటని టీడీపీ నేతలను ప్రశ్నించారు. 
 
అమరావతిలో భూములను అడ్డగోలుగా వేరే వారి పేర్లుతో కొనుగోలు చేసి అవి ఎక్కడ నష్టపోతాయోనన్న భయంతో అక్కడ ఉన్న రైతాంగాన్ని రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధిస్తుందని, అది ఓర్వలేకనే చంద్రబాబు అడ్డుపడుతున్నారన్నారు. జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో సచివాలయ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments