Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై ఏపీలో ఇంగ్లీషులోనే డిగ్రీ కోర్సులు - జగన్ సర్కారు ఆదేశం

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (17:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, ఇకపై డిగ్రీ కోర్సులను ఇంగ్లీషులోనే మొదలుపెట్టాలని నిర్ణయించింది. 
 
తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నత విద్యామండలి తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇకపై రాష్ట్రంలోని డిగ్రీ కోర్సులన్నీ కూడా ఇంగ్లీష్ మాధ్యమంలోనే అమలు కానున్నాయి.
 
'ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలు డిగ్రీ కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోనే అందించాలని.. అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కాలేజీలు తెలుగులో అమలు చేస్తున్న కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుకోవాలని' ఉన్నత విద్యామండలి సూచించింది. ఇవి కొత్త విద్యా సంవత్సరమైన 2021-22 నుంచే వర్తిస్తాయని తెలిపింది.
 
లాంగ్వేజ్ కోర్సులు మినహాయించి.. మిగిలిన విభాగాల కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుకునేందుకు ఈ నెల 18 నుంచి 28లోగా ప్రతిపాదనలు పంపాలని సూచించింది. గడువులోపు సమర్పించకపోతే.. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయా కోర్సుల నిర్వహణకు అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. 
 
కాగా, కొత్త విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా ఇంగ్లీష్‌ మీడియంలోనే కోర్సులను అందించాలని ఫిబ్రవరి 12వ తేదీన సీఎం వైఎస్ జగన్ ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments