Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానుల అంశంపై జగన్ సర్కార్‌కి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (14:12 IST)
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
 
జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ , జస్టిస్‌ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటీషన్ పైన విచారణ చేస్తూ... హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ రాజధానుల అంశం హైకోర్టులో విచారణ ఉంది కనుక దీనిపై తమ వద్దకు రావడం సరికాదంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు ఈ కేసును త్వరితగతిన పూర్తిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
 
 కాగా ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా రాజధానుల ఏర్పాటు ప్రక్రియ చేద్దామనుకున్న జగన్ సర్కార్ కి మరింత జాప్యం అయ్యే పరిస్థితి కనబడుతోంది. మరోవైపు అమరావతి రైతులు తమ పరిస్థితి ఏంటంటూ ఇప్పటికీ ఆందోళన చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments