Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానుల అంశంపై జగన్ సర్కార్‌కి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (14:12 IST)
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
 
జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ , జస్టిస్‌ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటీషన్ పైన విచారణ చేస్తూ... హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ రాజధానుల అంశం హైకోర్టులో విచారణ ఉంది కనుక దీనిపై తమ వద్దకు రావడం సరికాదంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు ఈ కేసును త్వరితగతిన పూర్తిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
 
 కాగా ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా రాజధానుల ఏర్పాటు ప్రక్రియ చేద్దామనుకున్న జగన్ సర్కార్ కి మరింత జాప్యం అయ్యే పరిస్థితి కనబడుతోంది. మరోవైపు అమరావతి రైతులు తమ పరిస్థితి ఏంటంటూ ఇప్పటికీ ఆందోళన చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments