Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్వేది నరసింహ స్వామికి కోటి రూపాయలతో నూతన రథం

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (21:09 IST)
అంతర్వేదిలో దగ్థమైన రథం నేపథ్యంలో నూతన రథం నిర్మాణ పనులు  ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో కొత్త రథం నూతన ఆకృతి నిర్మాణానికి వేగవంతంగా కార్యాచరణ జరుగుతోంది. కొత్త  ఆకృతి ప్రకారం నూతన రథానికి కోటి వ్యయం దాటవచ్చని అంచనా. మూడు నెలల్లోగా నూతన రథం తయారుచేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
 
నూతర రథం నిర్మాణం కోసం 21 అడుగులు పొడవు, 6 అడుగుల చుట్టు కొలతలు కలిగిన వందేళ్లు పైబడిన నాణ్యమైన బస్తర్ టేకును ఉపయోగిస్తున్నారు. ముహూర్తం ప్రకారం పూజా కార్యక్రమాలతో 
అంతర్వేది ప్రత్యేక అధికారి రామచంద్ర మోహన్ కర్ర కోతతో నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రభుత్వ నిధులతో కొత్త  రథం నిర్మాణం చేపడుతున్నారు.
 
2021 ఫిబ్రవరిలో స్వామి కల్యాణోత్సవాలు నాటికి రథం సిద్ధం చేయడానికి కసరత్తు చేస్తున్నారు. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా చేసిన ఆకృతి ప్రకారమే రథం నిర్మాణం చేపడుతున్నారు. ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తుల్లా నిర్మాణం చేయనున్నారు. పాత రథానికి వాడిన టేకు స్వచ్ఛమైన బర్మా కలప, మళ్లీ అదే కలపతో కొత్త రథం తయారు చేయిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments