Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరనున్న అవినాష్

Webdunia
గురువారం, 14 నవంబరు 2019 (08:54 IST)
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది టీడీపీ పరిస్థితి. ఆ పార్టీకి మరో షాక్ తగలడం ఖాయమైపోయింది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌ పార్టీని వీడనున్నారు. అనుచరుల వత్తిడి మేరకు అవినాశ్‌ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. 
 
ఈ అంశంపై చర్చించేందుకు బుధవారం రాత్రి గుణదలలోని తన నివాసంలో దేవినేని నెహ్రూ అభిమానులు, అనుచరులతో సమావేశం నిర్వహించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాటకు కట్టుబడి పని చేసిన అవినాశ్‌కు పార్టీలో తగిన న్యాయం జరగలేదంటూ పలువురు అభిమానులు అగ్రహం వ్యక్తం చేశారు. 
 
అవినాశ్‌కు టీడీపీలో ప్రాధాన్యం దక్కకుండా కొందరు నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో మెజారిటీ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు పార్టీ మారాలంటూ అవినాశ్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. 
 
ఎంత కష్టపడినా న్యాయం జరగని పార్టీలో కొనసాగినా విలువ ఉండదని వారు అభిప్రాయపడ్డారు. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల అభీష్టం మేరకు దేవినేని అవినాశ్‌ టీడీపీ వీడి.. వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటునట్టు తెలిసింది.
 
బెజవాడ రాజకీయాల్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా తమదైన ముద్ర వేసుకున్న దేవినేని కుటుంబానికి చెందిన అవినాశ్‌ టీడీపీని వీడాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దేవినేని నెహ్రూ రాజకీయ ప్రస్థానం టీడీపీ అవిర్భావంతోనే మొదలైంది. 
 
ఐదుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి మంత్రిగా పనిచేసిన నెహ్రూ రాజకీయ కారణాలతో కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అక్కడ ఇమడలేక తిరిగి టీడీపీలోకి వచ్చారు. చివరికి ఆయన జీవితం టీడీపీలోనే ముగిసింది. బెజవాడలో ఎంతోమంది రాజకీయ నాయకులకు గురువుగా గుర్తింపు తెచ్చుకున్న నెహ్రూ తనయుడు అవినాశ్‌ కూడా టీడీపీ యువ నాయకుడిగా విజయవాడ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. 

పార్టీలో ఆయన పనితీరును గుర్తించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ సీటును కేటాయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments