Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో చిక్కిన మరో చిరుత - 2 నెలల్లో 5 చిరుతల పట్టివేత

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (09:19 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో మరో చిరును తితిదే అధికారులు పట్టుకున్నారు. అలిపిరి - తిరుమల నడక మార్గంలో నరసింహ స్వామి ఆలయం ఏడో మైలు ప్రాంతంలో ఈ చిరుత బోనులో చిక్కినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో గత రెండు నెలల కాలంలో ఈ మార్గంలో పట్టుబడిన చిరుతల సంఖ్య ఐదుకు చేరిందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
నాలుగు రోజుల క్రితమే ఈ చిరుత కెమెరా కంట పడింది. అప్పటినుంచి అధికారులు దాన్ని బంధించేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల అలిపిరి నడకమార్గంలో చిరుత దాడి చేయడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక మృతిచెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల గిరుల్లో పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 
 
ఇటీవల అలిపిరి మెట్ల మార్గంలో ఓ చిరుత చేసిన దాడిలో నెల్లూరుకు చెందిన శ్రీలక్ష్మి అనే బాలిక ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత మెట్ల మార్గంలో భక్తలు రాకపోకలపై అనేక రకాలైన ఆంక్షలు విధించారు. తాజాగా నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు రక్షణగా చేతి కర్రలను కూడా అందజేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments