Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తొమ్మిది రోజుల పాటు శ్రీవారి దర్శనాలు రద్దు

venkateswara swamy
, గురువారం, 31 ఆగస్టు 2023 (17:19 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మొత్తం తొమ్మిది రోజులపాటు స్వామివారి దర్శనాలను రద్దు చేస్తున్నట్టు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెప్టెంబరు 18వ తేదీన స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలను తొమ్మిది రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సమయంలో జర్మన్ షెడ్లను వేసి లాకర్లు ఏర్పాటుచేస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలను అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. సెప్టెంబరు 18వ తేదీన స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. 
 
గరుడ సేవ రోజును రద్దీని దృష్ట్యా ప్రత్యేక భద్రతా చర్యలను తీసుకుంటున్నామని వివరించారు. భక్తులకు వైద్యం అందుబాటులో ఉంచేందుకు రుయా ఆస్పత్రి సిబ్బందిని రపిస్తామని తెలిపారు. ఘాట్‌ రోడ్డులో 24 గంటల పాటు ఆర్టీసీ బస్సులు నడుస్తాయని, క్రూర మృగాల సంచారం నేపథ్యంలో నడకదారులు, ఘాట్ రోడ్లలో ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. అటవీ శాఖ ఇచ్చే నివేదిక మేరకు నడక మార్గంలో నిబంధనలను సడలిస్తామని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికలు ఫుట్ బాల్ ఆడేలా అవకాశాలను అందించేందుకు ఫిఫాతో కలిసి రెక్సోనా ‘బ్రేకింగ్ లిమిట్స్: గర్ల్స్ కెన్’ సిరీస్‌