Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణయ్ హత్య గుర్తిందిగా అంటూ బెదిరింపులు.. గుంటూరులో మరో అమృత

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (14:44 IST)
మిర్యాలగూడలో అమృత-ప్రణయ్‌ల లవ్ స్టోరీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, అమృత-ప్రణయ్‌లు కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రణయ్ వేరు కులానికి చెందిన వాడు కావడంతో అమృత తండ్రి అల్లుడిని కిరాయి హంతకుల చేత చంపించాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా అలాంటి కేసు ఒకటి గుంటూరులో వెలుగులోకి వచ్చింది. నగరంలో ఓ వివాహిత కిడ్నాప్ అయింది.
 
విజయవాడకు చెందిన వైశ్య యువతిని గుంటూరుకు చెందిన దళిత యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. జూలై నెలలో ఈ కులాంతర వివాహం దిలీప్ - సౌమ్యలు చేసుకున్నారు. అయితే పెళ్ళి చేసుకున్న నాటి నుంచి యువతి -యువకుడికి తీవ్ర స్థాయిలో బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. నల్గొండ ప్రణయ్ విషయం గుర్తు ఉందిగా అంటూ హెచ్చరించారు. 
 
ప్రణయ్ మాదిరిగా హత్య చేస్తామని యువతి తల్లిదండ్రులు బెదిరింపులకు పాల్పడ్డారు. మంగళవారం నాడు దిలీప్ కుటుంబసభ్యులను కొట్టి సౌమ్యను తీసుకెళ్లారు. మిర్యాలగూడలో ప్రణయ్‌ను హత్య చేసినట్టుగానే హత్య చేయిస్తామని తనను బెదిరించారని సౌమ్య కుటుంబ సభ్యులపై దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
సౌమ్య కుటుంబ సభ్యులతో తనకు ప్రాణహాని ఉందని దిలీప్ గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments