Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణయ్ హత్య గుర్తిందిగా అంటూ బెదిరింపులు.. గుంటూరులో మరో అమృత

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (14:44 IST)
మిర్యాలగూడలో అమృత-ప్రణయ్‌ల లవ్ స్టోరీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, అమృత-ప్రణయ్‌లు కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రణయ్ వేరు కులానికి చెందిన వాడు కావడంతో అమృత తండ్రి అల్లుడిని కిరాయి హంతకుల చేత చంపించాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా అలాంటి కేసు ఒకటి గుంటూరులో వెలుగులోకి వచ్చింది. నగరంలో ఓ వివాహిత కిడ్నాప్ అయింది.
 
విజయవాడకు చెందిన వైశ్య యువతిని గుంటూరుకు చెందిన దళిత యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. జూలై నెలలో ఈ కులాంతర వివాహం దిలీప్ - సౌమ్యలు చేసుకున్నారు. అయితే పెళ్ళి చేసుకున్న నాటి నుంచి యువతి -యువకుడికి తీవ్ర స్థాయిలో బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. నల్గొండ ప్రణయ్ విషయం గుర్తు ఉందిగా అంటూ హెచ్చరించారు. 
 
ప్రణయ్ మాదిరిగా హత్య చేస్తామని యువతి తల్లిదండ్రులు బెదిరింపులకు పాల్పడ్డారు. మంగళవారం నాడు దిలీప్ కుటుంబసభ్యులను కొట్టి సౌమ్యను తీసుకెళ్లారు. మిర్యాలగూడలో ప్రణయ్‌ను హత్య చేసినట్టుగానే హత్య చేయిస్తామని తనను బెదిరించారని సౌమ్య కుటుంబ సభ్యులపై దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
సౌమ్య కుటుంబ సభ్యులతో తనకు ప్రాణహాని ఉందని దిలీప్ గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments