Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణయ్ హత్య గుర్తిందిగా అంటూ బెదిరింపులు.. గుంటూరులో మరో అమృత

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (14:44 IST)
మిర్యాలగూడలో అమృత-ప్రణయ్‌ల లవ్ స్టోరీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, అమృత-ప్రణయ్‌లు కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రణయ్ వేరు కులానికి చెందిన వాడు కావడంతో అమృత తండ్రి అల్లుడిని కిరాయి హంతకుల చేత చంపించాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా అలాంటి కేసు ఒకటి గుంటూరులో వెలుగులోకి వచ్చింది. నగరంలో ఓ వివాహిత కిడ్నాప్ అయింది.
 
విజయవాడకు చెందిన వైశ్య యువతిని గుంటూరుకు చెందిన దళిత యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. జూలై నెలలో ఈ కులాంతర వివాహం దిలీప్ - సౌమ్యలు చేసుకున్నారు. అయితే పెళ్ళి చేసుకున్న నాటి నుంచి యువతి -యువకుడికి తీవ్ర స్థాయిలో బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. నల్గొండ ప్రణయ్ విషయం గుర్తు ఉందిగా అంటూ హెచ్చరించారు. 
 
ప్రణయ్ మాదిరిగా హత్య చేస్తామని యువతి తల్లిదండ్రులు బెదిరింపులకు పాల్పడ్డారు. మంగళవారం నాడు దిలీప్ కుటుంబసభ్యులను కొట్టి సౌమ్యను తీసుకెళ్లారు. మిర్యాలగూడలో ప్రణయ్‌ను హత్య చేసినట్టుగానే హత్య చేయిస్తామని తనను బెదిరించారని సౌమ్య కుటుంబ సభ్యులపై దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
సౌమ్య కుటుంబ సభ్యులతో తనకు ప్రాణహాని ఉందని దిలీప్ గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments