Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటక ప్రాంతాల్లో మరో 300 వైన్ షాపులు, ఇదేనా మ‌ద్య‌నిషేధం?

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (12:02 IST)
జగన్ రెడ్డి చెప్పిన మద్యపాన నిషేదం హామీ ఏమైంది? మద్యం షాపులు పెంచట‌మేనా మద్యపాన నిషేధ‌మా? అని ఏపీ టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌శ్నించారు.

ఉన్న మద్యం షాపులు చాలవన్నట్లుగా పట్టణాలు, పర్యాటక ప్రాంతాల్లో మరో  300 షాపులు ఏర్పాటు చేయటం ప్రజలను మోసం చేయటమే అన్నారు. గ్రామాల్లో మద్యం షాపు లేని బజారు ఉందా? మద్యాన్ని ఏరులై పారిస్తూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారు... జగన్ రెడ్డి తన కమిషన్ల కోసం  నాసిరకం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల  ప్రాణాలతో చెలగాటమాడుతున్నార‌ని విమ‌ర్శించారు. 
 
మద్యంపై వచ్చే ఆదాయం చూపి ఏపీ అభివృద్ది కార్పోరేషన్ ద్వారా  రూ. 25 వేల కోట్లు అప్పు తెచ్చార‌ని, అప్పులు తెచ్చి అవి తీర్చలేక మద్యం రేట్లు పెంచి మందుబాబుల రక్తంతో, వారి కుటుంబాల కన్నీళ్లతో ఆ అప్పులు తీర్చాలని చూస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. మద్యం ఆదాయం మత్తులో మునిగిన వైసీపీ ప్రభుత్వానికి మహిళలు మత్తు వదిలించటం ఖాయమ‌ని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments