Webdunia - Bharat's app for daily news and videos

Install App

టంగుటూరులో విషాదం - ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (11:53 IST)
ప్రకాశం జిల్లా టంగుటూరులో విషాదం జరిగింది. ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. సోమవారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
టంగుటూరు మండలంలోని ఎం.నిడమానూరుకు చెందిన ముగ్గురు విద్యార్థులు మూసీ నదిలో ఈతకు వెళ్లారు. అయితే, ముగ్గురు విగతజీవులుగా మారారు. మృతులను వాసు (15), జగన్ (12), మహేష్ (13)లుగా గుర్తించారు. వీరంతా నిడమానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. 
 
ఆదివారం సెలవురోజు కావడంతో మధ్యాహ్నం సమయంలో క్రికెట్ ఆడేందుకు పొందూరు పంచాయతీ పొదవారిపాళెం సమీపంలోవున్న మూసీ నది వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ముగ్గురు విద్యార్థులు నదిలో స్నానం చేసేందుకు దిగారు. అంతే ఆ ముగ్గురు నీటిలో కొట్టుకునిపోయారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలించగా, సోమవారం ఉదయం మొదట రెండు మృతదేహాలను గుర్తించారు. ఆ తర్వాత మరో మృతదేహం కూడా లభ్యమైనట్టు పోలీసులు వెల్లడించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments