Webdunia - Bharat's app for daily news and videos

Install App

టంగుటూరులో విషాదం - ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (11:53 IST)
ప్రకాశం జిల్లా టంగుటూరులో విషాదం జరిగింది. ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. సోమవారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
టంగుటూరు మండలంలోని ఎం.నిడమానూరుకు చెందిన ముగ్గురు విద్యార్థులు మూసీ నదిలో ఈతకు వెళ్లారు. అయితే, ముగ్గురు విగతజీవులుగా మారారు. మృతులను వాసు (15), జగన్ (12), మహేష్ (13)లుగా గుర్తించారు. వీరంతా నిడమానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. 
 
ఆదివారం సెలవురోజు కావడంతో మధ్యాహ్నం సమయంలో క్రికెట్ ఆడేందుకు పొందూరు పంచాయతీ పొదవారిపాళెం సమీపంలోవున్న మూసీ నది వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ముగ్గురు విద్యార్థులు నదిలో స్నానం చేసేందుకు దిగారు. అంతే ఆ ముగ్గురు నీటిలో కొట్టుకునిపోయారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలించగా, సోమవారం ఉదయం మొదట రెండు మృతదేహాలను గుర్తించారు. ఆ తర్వాత మరో మృతదేహం కూడా లభ్యమైనట్టు పోలీసులు వెల్లడించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments