Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్‌కు సిద్ధపడితే రండి లేదా భోజనం పెడతాం సరిహద్దుల్లో ఉండండి : సీఎం జగన్

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (17:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో 13కు చేరాయి. మరికొందరి రిపోర్టులు రావాల్సివుంది. తాజాగా అధికార పార్టీకి చెందిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో హోం క్వారంటైన్‌లో ఉంచారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలపై సీఎం జగన్ శనివారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి సరిహద్దుల్లో వసతులు, భోజనం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ సరిహద్దుల్లో ఉండేవారు 14 రోజులు క్వారంటైన్‌కు సిద్ధ పడేవారిని రాష్ట్రంలోని అడుగుపెట్టనివ్వాలని కోరారు. 
 
నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలకు తగ్గట్టుగా రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలను అందుబాటులోకి తీసుకురావాలని... ఆ తర్వాత వాటి కొనుగోలు సమయాన్ని తగ్గించాలని చెప్పారు. కరోనా బాధితుల చికిత్స కోసం స్వచ్ఛందంగా వచ్చే  వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలని జగన్ సూచించారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి 10 మందికి ఒక డాక్టర్‌ను కేటాయించాలని చెప్పారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ఐసోలేషన్‌కు తరలించాలని, ఇందులో ఏమాత్రం ఉదాసీనత ప్రదర్శించవద్దని సీఎం అధికారులను కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments