Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో పెట్రేగిపోతున్న ఇసుక మాఫియా

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (15:05 IST)
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇసుక పాలసీని అమలులోకి తీసుకుని‌‌వచ్చి సామాన్యులకు ఇసుకను సరసమైన ధరలకే అందిస్తూ, ఇసుక అక్రమ రవాణాకు తావులేకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పగడ్భందీ ప్రణాళికను రూపొందించినప్పటికి సంబంధిత అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా ఇసుక మాఫియా పెట్రేగిపోతున్న పరిస్థితి శోచనీయంగా మారిన వైనం.
 
చిత్తూరు జిల్లా వరదయ్యపాళ్ళెం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చెన్నవారి పాళ్యెం కరుణానది పరివాహక ప్రాంతం నుండి ట్రాక్టరుల సాయంతో అర్థరాత్రి గుట్టచప్పుడు కాకుండా యధేచ్చగా ఇసుకను తరలిస్తూ ఇసుకాసురులు జేబులు నింపుకుంటున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇసుక తరలించే విధానంలో‌ ప్రభుత్వం కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టినప్పటికి అవేవీ పాటించాల్సిన అవసరం లేనట్టు ఇసుక రవాణా సాగుతుంది.
 
వరదయ్యపాళ్ళెం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ మీదుగా ఈ ఇసుక రవాణా జరుగుతుండటంతో సంబంధిత అధికారుల పనితీరు ప్రశ్నార్ధకంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రక్షణశాఖలోని కొందరి ఇంటిదొంగల సహకారంతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనే పలు అంశాలను స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు నిద్రావస్థలో నుండి మేల్కోని నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఇసుక దందాకు అడ్డుకట్టవేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments