Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ శాసనసభ ఉప సభాపతిగా రఘురామ కృష్ణంరాజు ఏకగ్రీవ ఎన్నిక

ఠాగూర్
గురువారం, 14 నవంబరు 2024 (15:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతిగా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్ఆర్అర్ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు సభాపతి సీహెచ్. అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉప సభాపతిగా ఎన్నికైన రఘురామకు ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు.
 
అంతకుముందు ఎన్డీయే కూటమి తరఫున డిప్యూటీ స్పీకర్ పదవికి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరును కూటమి నేతలు ప్రకటించారు. దీంతో కూటమి నేతలు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, మంత్రులు మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, టీటీడీ ఏపీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులతో కలిసి రఘురామ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
 
డిప్యూటీ స్పీకర్ పదవికి ఇతరులు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో గురువారం మధ్యాహ్నం స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు. కాగా, అసెంబ్లీలో చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు, మండలిలో చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధను నియమించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments