సంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు.. నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపేశాడు.. (video)

సెల్వి
గురువారం, 14 నవంబరు 2024 (14:59 IST)
సంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు కలకలం రేపింది. ఓ వ్యక్తి నడిరోడ్డుపైనే పాత కక్షలతో తల్లీకొడుకులను కత్తితో పొడిచి చంపేశాడు. గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని వీరభద్రకాలనీలో ఈ ఘటన జరిగింది. 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తల్లీకొడుకలను కత్తితో పొడిచి చంపేశాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
మృతులు యూపీకి చెందిన సరోజాదేవి (50), అనిల్ (30)గా గుర్తించారు. కాగా, పాత గొడవలే హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. తన రెండేళ్ల కొడుకు చావుకు వీరు కారణమని అందుకే వారిని చంపినట్లు నిందితుడు నాగరాజు చెబుతున్నట్లు తెలుస్తోంది.
 
తన భార్యపై కూడా మృతులిద్దరూ దాడి చేసేందుకు ఇంట్లోకి వచ్చినట్లు ఆరోపించాడు. కొడుకు చనిపోయిన రెండేళ్ల తర్వాత కక్ష పెంచుకుని ఈ రోజు కత్తితో దాడి చేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తు జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments