Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్పంచి అభ్యర్థి కిడ్నాప్.. అధికార పార్టీ నేతలపై అనుమానం

Webdunia
ఆదివారం, 31 జనవరి 2021 (13:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలతో గ్రామ రాజకీయాలు వేడెక్కాయి. నామినేషన్ల పర్వం నడుస్తుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
 
అయితే, ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం పెద్దగంజాంలో తెదేపా బలపరిచిన సర్పంచి అభ్యర్థి కిడ్నాప్ కలకలం రేపుతోంది. అధికార పార్టీకి చెందిన నేతలే తమ అభ్యర్థిని కిడ్నాప్ చేశారంటూ తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. 
 
ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం పెద్దగంజాం గ్రామానికి చెందిన యల్లావుల తిరుపతిరావు తెదేపా బలపరిచిన సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. గ్రామంలోని పోలేరమ్మ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం నామినేషన్ వేసేందుకు బయల్దేరగా.. కొందరు వ్యక్తులు ఆయనను బెదిరించి కిడ్నాప్ చేశారు. 
 
అధికార పార్టీకి చెందిన నేతలే తిరుపతిరావును కిడ్నాప్ చేశారని ఆయన బంధువులు, తెదేపా నేతలు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గ్రామానికి చేరుకొని కిడ్నాప్ విషయంపై ఆరా తీశారు. 
 
అనంతరం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్​కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బలగాల ద్వారా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాపైన అభ్యర్థిని విడిచిపెట్టే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని ఎమ్మెల్యే సాంబశివరావు భీష్మించి కూర్చొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments