Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావలి పట్టణంలో కరోనా మరణ మృదంగం.. 10 రోజుల లాక్డౌన్

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (16:37 IST)
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో కరోనా వైరస్ మరణ మృదంగం కొనసాగిస్తోంది. దీంతో ఒక్క రోజే ఏకంగా ఏడుగురు వ్యాపారులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా కావలి పట్టణ ప్రజలంతా స్వచ్చంధంగా లాక్డౌన్ పాటించాలని నిర్ణయించారు. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతున్న విషయం తెల్సిందే. రోజుకు పదివేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కారణంగా రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కరోనా వైరస్ నెల్లూరు జిల్లాలో సైతం పంజా విసురుతోంది. జిల్లాలోని కావలిలో ఏకంగా ఏడుగురు వ్యాపారులు కారోనా కారణంగా మృతి చెందడంతో జనాలు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు అక్కడి వ్యాపార వర్గాలు సిద్ధమయ్యాయి. 
 
శనివారం నుంచి ఏకంగా పది రోజుల పాటు లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలంతా తమ వంతుగా లాక్డౌన్‌కు సహకరించాలని విన్నవించారు.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments