Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకున్న ఏపీ సర్కారు

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (16:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణం తీసుకుంది. భారత రిజర్వు బ్యాంకు బాండ్లను వేలం చేయడం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది. మొత్తం వెయ్యి కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది. మొత్తం రూ.వెయ్యి కోట్లలో రూ.500 కోట్లను 12 సంవత్సరాలకు 7.71 శాతం వడ్డీతోనూ, మరో రూ.500 కోట్లు రూ.7.60శాతం వడ్డీకి తీసుకుంది. దీంతో ఈ యేడాదిలో ఇప్పటివరకు ఏపీ సర్కారు తీసుకున్న మొత్తం రుణం రూ.49600 కోట్లకు చేరుకుంది. 
 
రిజర్వు బ్యాంకులో ప్రతి మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం పాటలు జరుగుతుంటాయి. గత కొంతకాలంగా ప్రతి మంగళవారం ఏపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఈ వేలం పాటలో పాల్గొని రుణాన్ని సేకరిస్తుంది. ఆ విధంగా ప్రతి మంగళవారం రూ.1000 కోట్ల మేరకు రుణం సేకరిస్తుంది. 
 
అయితే, గతంలో తీసుకున్న రుణానికి వసూలు చేసే వడ్డీ కంటే ఇపుడు తీసుకున్న రుణానికి విధించిన వడ్డీ శాతం అధికమనే వాదనలు వినిపిస్తున్నాయి. 
 
మరోవైపు, కేంద్రం విధించిన ఎఫ్ఆర్బీఎం పరిధిని ఏపీ ప్రభుత్వం దాటేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డు రుణాలు మినహా మరే ఇతర రుణాలు ఏపీ సర్కారు అందే అవకాశమే లేదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments