Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలు ఖరారు - రేట్ల వివరాలు ఇవే...

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (19:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ జీవో జారీచేసింది. ఈ జీవో ప్రకారం నాన్ ఏసీ థియేటర్, ఏసీ థియేటర్, మల్టీప్లెక్స్‌లలో వారీగా టిక్కెట్ ధరలను పెంచింది. ప్రతి థియేటర్‌లోనూ ప్రీమియర్, నాన్ ప్రీమియం కేటగిరీలుగా టిక్కెట్ రేట్లను విభజించింది. 
 
ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాన్ ఏసీ థియేటర్‌లో సినిమా టిక్కెట్ ధరలు రూ.60, రూ.40, ఏసీ థియేటర్‌లో రూ.100, రూ.70, స్పెషల్ థియేటర్లలో రూ.125, రూ.100, మల్టీ ప్లెక్స్‌లలో రూ.150గా సినిమా టిక్కెట్ ధరలను ఖరారు చేసింది. ఒక వేళ రిక్లయినర్ సీట్లు ఉంటే రూ.250గా విక్రయించుకోవచ్చని ఆ జీవోలో స్పష్టం చేసింది.
 
అలాగే, మున్సిపాలిటీలలో నాన్ ఏసీ థియేటర్‌లో రూ.50, రూ.30, ఏసీ థియేటర్‌లో రూ.80, రూ.60, స్పెషల్ థియేటర్‌లో రూ.100, రూ.80, మల్టీప్లెక్స్‌లలో రూ.125గా నిర్ణయించింది.
 
ఇకపోతే గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే థియేటర్లలో (సి, డి సెంటర్లు) నానా ఏసీ థియేటర్‌లో రూ.40, రూ.20, ఏసీ థియేటర్‌లో రూ.70, రూ.50, స్పెషల్ థియేటర్‌లో రూ.90, రూ.70, మల్టీప్లెక్స్‌లలో రూ.100గా సినిమా టిక్కెట్ ధరలను నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments