Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలు ఖరారు - రేట్ల వివరాలు ఇవే...

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (19:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ జీవో జారీచేసింది. ఈ జీవో ప్రకారం నాన్ ఏసీ థియేటర్, ఏసీ థియేటర్, మల్టీప్లెక్స్‌లలో వారీగా టిక్కెట్ ధరలను పెంచింది. ప్రతి థియేటర్‌లోనూ ప్రీమియర్, నాన్ ప్రీమియం కేటగిరీలుగా టిక్కెట్ రేట్లను విభజించింది. 
 
ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాన్ ఏసీ థియేటర్‌లో సినిమా టిక్కెట్ ధరలు రూ.60, రూ.40, ఏసీ థియేటర్‌లో రూ.100, రూ.70, స్పెషల్ థియేటర్లలో రూ.125, రూ.100, మల్టీ ప్లెక్స్‌లలో రూ.150గా సినిమా టిక్కెట్ ధరలను ఖరారు చేసింది. ఒక వేళ రిక్లయినర్ సీట్లు ఉంటే రూ.250గా విక్రయించుకోవచ్చని ఆ జీవోలో స్పష్టం చేసింది.
 
అలాగే, మున్సిపాలిటీలలో నాన్ ఏసీ థియేటర్‌లో రూ.50, రూ.30, ఏసీ థియేటర్‌లో రూ.80, రూ.60, స్పెషల్ థియేటర్‌లో రూ.100, రూ.80, మల్టీప్లెక్స్‌లలో రూ.125గా నిర్ణయించింది.
 
ఇకపోతే గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే థియేటర్లలో (సి, డి సెంటర్లు) నానా ఏసీ థియేటర్‌లో రూ.40, రూ.20, ఏసీ థియేటర్‌లో రూ.70, రూ.50, స్పెషల్ థియేటర్‌లో రూ.90, రూ.70, మల్టీప్లెక్స్‌లలో రూ.100గా సినిమా టిక్కెట్ ధరలను నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments