Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీగా పెరగనున్న విద్యుత్ చార్జీలు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (16:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు భారీగా పెరుగనున్నాయి. విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కింలు ప్రతిపాదించాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 13 విద్యుత్ శ్లాబులు ఉండగా, వీటిని ఆరు శ్లాబులుగా కుదించనున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఉండే శ్లాబులపై యూనిట్‌కు 20 పైసలు నుంచి రూ.1.40 పైసలు చొప్పున వడ్డించనున్నారు. 
 
ఈ పెంచిన కొత్త చార్జీలు ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త చార్జీలకు సంబంధించి ఈ నెల 30వ తేదీన ఏపీఈఆర్సీ ఉత్తర్వులను వెలువరించే అవకాశం ఉంది. అంటే జూలై వరకు పాత విద్యుత్ చార్జీలనే వసూలు చేస్తారు. ఆగస్టు నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 
 
కాగా, ఆగస్టు నుంచి ప్రతిపాదించిన చార్జీల టారిఫ్‌ను పరిశీలిస్తే, కేటగిరీ ఏ కింద 0 నుంచి 30 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.45 చొప్పున వసూలు చేస్తారు. కేటగిరీ ఏ కింద 31 నుంచి 75 యూనిట్ల వరకు యూనిట్‌కు 2.80 చొప్పున వసూలు చేస్తారు. 
 
కేటగిరీ బి కింద 0 నుంచి 100 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు 4 రూపాయలు చొప్పున వసూలు చేస్తారు. కేటగిరీ బి కింద 101 నుంచి 200 వరకు యూనిట్‌కు రూ.5 చొప్పున వసూలు చేస్తారు. కేటగిరీ బీ కింద 201 నుంచి 300 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ.7 చొప్పున వసూలు చేస్తారు. 300 యూనిట్లకుపైగా ఒక్కో యూనిట్‌కు రూ.7.50 పైసలు చొప్పున వసూలు చేసేలా నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments