Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీగా పెరగనున్న విద్యుత్ చార్జీలు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (16:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు భారీగా పెరుగనున్నాయి. విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కింలు ప్రతిపాదించాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 13 విద్యుత్ శ్లాబులు ఉండగా, వీటిని ఆరు శ్లాబులుగా కుదించనున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఉండే శ్లాబులపై యూనిట్‌కు 20 పైసలు నుంచి రూ.1.40 పైసలు చొప్పున వడ్డించనున్నారు. 
 
ఈ పెంచిన కొత్త చార్జీలు ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త చార్జీలకు సంబంధించి ఈ నెల 30వ తేదీన ఏపీఈఆర్సీ ఉత్తర్వులను వెలువరించే అవకాశం ఉంది. అంటే జూలై వరకు పాత విద్యుత్ చార్జీలనే వసూలు చేస్తారు. ఆగస్టు నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 
 
కాగా, ఆగస్టు నుంచి ప్రతిపాదించిన చార్జీల టారిఫ్‌ను పరిశీలిస్తే, కేటగిరీ ఏ కింద 0 నుంచి 30 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.45 చొప్పున వసూలు చేస్తారు. కేటగిరీ ఏ కింద 31 నుంచి 75 యూనిట్ల వరకు యూనిట్‌కు 2.80 చొప్పున వసూలు చేస్తారు. 
 
కేటగిరీ బి కింద 0 నుంచి 100 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు 4 రూపాయలు చొప్పున వసూలు చేస్తారు. కేటగిరీ బి కింద 101 నుంచి 200 వరకు యూనిట్‌కు రూ.5 చొప్పున వసూలు చేస్తారు. కేటగిరీ బీ కింద 201 నుంచి 300 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ.7 చొప్పున వసూలు చేస్తారు. 300 యూనిట్లకుపైగా ఒక్కో యూనిట్‌కు రూ.7.50 పైసలు చొప్పున వసూలు చేసేలా నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments