Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీగా పెరగనున్న విద్యుత్ చార్జీలు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (16:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు భారీగా పెరుగనున్నాయి. విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కింలు ప్రతిపాదించాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 13 విద్యుత్ శ్లాబులు ఉండగా, వీటిని ఆరు శ్లాబులుగా కుదించనున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఉండే శ్లాబులపై యూనిట్‌కు 20 పైసలు నుంచి రూ.1.40 పైసలు చొప్పున వడ్డించనున్నారు. 
 
ఈ పెంచిన కొత్త చార్జీలు ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త చార్జీలకు సంబంధించి ఈ నెల 30వ తేదీన ఏపీఈఆర్సీ ఉత్తర్వులను వెలువరించే అవకాశం ఉంది. అంటే జూలై వరకు పాత విద్యుత్ చార్జీలనే వసూలు చేస్తారు. ఆగస్టు నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 
 
కాగా, ఆగస్టు నుంచి ప్రతిపాదించిన చార్జీల టారిఫ్‌ను పరిశీలిస్తే, కేటగిరీ ఏ కింద 0 నుంచి 30 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.45 చొప్పున వసూలు చేస్తారు. కేటగిరీ ఏ కింద 31 నుంచి 75 యూనిట్ల వరకు యూనిట్‌కు 2.80 చొప్పున వసూలు చేస్తారు. 
 
కేటగిరీ బి కింద 0 నుంచి 100 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు 4 రూపాయలు చొప్పున వసూలు చేస్తారు. కేటగిరీ బి కింద 101 నుంచి 200 వరకు యూనిట్‌కు రూ.5 చొప్పున వసూలు చేస్తారు. కేటగిరీ బీ కింద 201 నుంచి 300 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ.7 చొప్పున వసూలు చేస్తారు. 300 యూనిట్లకుపైగా ఒక్కో యూనిట్‌కు రూ.7.50 పైసలు చొప్పున వసూలు చేసేలా నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments