Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా - గోదావరి నదులకు మళ్లీ వరద హెచ్చరిక

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (12:53 IST)
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులకు మళ్లీ వరద రావొచ్చని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్జీటీఎస్) హెచ్చరించింది. దీనిపై ఆర్జీటీఎస్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
అంతేకాకుండా, ఈ నెల 22వ తేదీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. 
దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 23 నుండి 26వ తేదీ వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
 
19వ తేదీ అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఫలితంగా గుజరాత్ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపారు. మహారాష్ట్రలో వర్షాల వల్ల కృష్ణా, గోదావరి నదులకు భారీగా రానుందని పేర్కొంది. 
 
ఈ నెల 21 నుండి అక్టోబరు 2వ తేదీ వరకు కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద సంభవించే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో భారీగా వదర వచ్చే అవకాశాలున్నట్టు తెలిపింది. అందువల్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments