Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పని చేసిన తొలి రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్.. ఎందుకు?

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (12:42 IST)
కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ చరిత్ర సృష్టించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్‌లో ప్రయాణించారు. తద్వారా తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రిగా చరిత్ర సృష్టించారు. ఈ యుద్ధవిమానం గురువారం ఉదయం 9.58కి బెంగళూరులోని హెచ్ఏఎల్ నుంచి బయల్దేరి 30 నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది. 
 
కాగా బయల్దేరే ముందు 45 స్క్వాడ్రన్‌ ఫ్లయింగ్ డాగర్స్‌కు చెందిన పైలట్లు విమానం గురించి రాజ్‌నాథ్‌కు పరిచయం చేశారు. ఏవియానిక్స్, నియంత్రణ, రాడార్, గ్లాస్ కాక్‌పిట్లతో పాటు యుద్ధంలో ఇది మోసుకు పోయే ఆయుధాలను కూడా వివరించారు.
 
ఈ యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టిన తర్వాత రాజ్‌నాథ్ స్పందిస్తూ, 'యుద్ధ విన్యాసానికి సన్నద్ధమయ్యా' అని వ్యాఖ్యానించారు. జీ-సూట్ వేసుకున్న ఫొటోలు షేర్ చేశారు. కాగా, విమానంలో చక్కర్లు కొట్టిన అనంతరం డీఆర్‌డీవో చీఫ్ డాక్టర్ సతీశ్ రెడ్డితో కలిసి రాజ్‌నాథ్ సింగ్ మీడితో మాట్లాడారు. 
 
'కొద్దిసేపు రక్షణమంత్రి కూడా తేజస్‌ని నియంత్రిస్తూ నడిపించారు' అని సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో రాజ్‌నాథ్ కలగజేసుకుంటూ.. 'పైలట్ తివారీ ఎలా చెబితే అలా నడుపుతూ వచ్చాను.. ఏ సమస్యా ఎదురు కాలేదు' అని అని పేర్కొనడంతో అందరి ముఖంలో నవ్వులు విరిశాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments