Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా గాంధీతో సమావేశమైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (19:17 IST)
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం పిలుపు మేరకు మూడు రోజుల క్రితం హస్తినకు వెళ్లిన నల్లారి.. అక్కడే ఉన్నారు.  
 
ఈ పర్యటనలో భాగంగా, ఆయన శుక్రవారం సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఆ తర్వాతే ఏపీకి తిరుగు పయనమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం సోనియా గాంధీతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్‌కు తిరుగి బయలుదేరారు. 
 
అయితే, ఢిల్లీకి వెళ్లిన తొలి రోజున ఆయన తన వ్యక్తిగత పనుల కోసమే ఇక్కడకు వచ్చినట్టు చెప్పిన నల్లారి.. ఆ తర్వాత ఆయన మీడియాకు కనిపించనేలేదు. అలాగే, సోనియా గాంధీతో భేటీ తర్వాత కూడా ఆయన మీడియాకు ముఖం చాటేశారు. కాగా, సోనియా, కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య దాదాపు 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది. 
 
ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెప్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితలతో పాటు 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు తదిత అంశాలపై చర్చినట్టు వినికిడి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments