Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా గాంధీతో సమావేశమైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (19:17 IST)
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం పిలుపు మేరకు మూడు రోజుల క్రితం హస్తినకు వెళ్లిన నల్లారి.. అక్కడే ఉన్నారు.  
 
ఈ పర్యటనలో భాగంగా, ఆయన శుక్రవారం సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఆ తర్వాతే ఏపీకి తిరుగు పయనమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం సోనియా గాంధీతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్‌కు తిరుగి బయలుదేరారు. 
 
అయితే, ఢిల్లీకి వెళ్లిన తొలి రోజున ఆయన తన వ్యక్తిగత పనుల కోసమే ఇక్కడకు వచ్చినట్టు చెప్పిన నల్లారి.. ఆ తర్వాత ఆయన మీడియాకు కనిపించనేలేదు. అలాగే, సోనియా గాంధీతో భేటీ తర్వాత కూడా ఆయన మీడియాకు ముఖం చాటేశారు. కాగా, సోనియా, కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య దాదాపు 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది. 
 
ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెప్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితలతో పాటు 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు తదిత అంశాలపై చర్చినట్టు వినికిడి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments