Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాలు విరిగి ఇంట్లో ఉన్న మందా కృష్ణ మాదిక.. కలిసిన వైఎస్. షర్మిల

కాలు విరిగి ఇంట్లో ఉన్న మందా కృష్ణ మాదిక.. కలిసిన వైఎస్. షర్మిల
, బుధవారం, 8 సెప్టెంబరు 2021 (12:35 IST)
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌ కృష్ణ మాదిగ కాలు విరిగి ఇంట్లో ఉన్నారు. ఇటీవల ఆయన బాత్‌‌రూంలో కాలు జారి పడ‌డంతో బోన్‌‌ ఫ్రాక్చర్ అయింది. దీంతో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. 
 
ఆయ‌నకు చిన్నపాటి ఆపరేషన్ కూడా జరిగింది. ఈ ఆపరేషన్ నుంచి కోలుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌నను వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల క‌లిశారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆమె ఫొటో పోస్ట్ చేశారు.
 
'ఎమ్మార్పీఎస్‌ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు శ్రీ మంద‌ కృష్ణ మాదిగని ఈ రోజు తన‌ నివాసంలో కలసి ప‌రామ‌ర్శించ‌డం జ‌రిగింది. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించాను. అలాగే, సెప్టెంబ‌రు 12న వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ తిరుమ‌ల‌గిరిలో నిర్వహించే "ద‌ళిత భేరి" బహిరంగ స‌భ‌కు ఆయ‌న‌ను ఆహ్వానించాను' అని ష‌ర్మిల తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షరియా చట్టాల అమలులో వెనక్కి తగ్గేదే లేదు : తేల్చి చెప్పిన తాలిబన్లు