Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ.. 7,998 మందికి పాజిటివ్

Webdunia
గురువారం, 23 జులై 2020 (19:31 IST)
కరోనా వైరస్ ఏపీలో విజృంభిస్తోంది. రోజురోజుకూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయే తప్పితే తగ్గే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. అయితే పెద్ద సంఖ్యలో కరోనా టెస్ట్‌లు చేస్తున్నా.. భారీగానే కేసులు నమోదవుతున్నాయని వైద్య శాఖాధికారులు చెబుతున్నారు. గురువారం నాడు మొత్తం 58,052 మందికి కరోనా పరీక్షలు చేయగా 7,998 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 
 
కాగా గురువారం నమోదైన కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో భారీగా 1391 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 1184, అనంతపురంలో 1016 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 904 కేసులు, పశ్చిమ గోదావరిలో 748 కేసులు నమోదయ్యాయి. మొత్తానికి చూస్తే.. కోస్తాంధ్రలో గోదావరి జిల్లాల్లో, గుంటూరు, విశాఖపట్నంలో.. రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి.
 
ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 884 మంది మృతి చెందారు. మొత్తానికి చూస్తే.. అటు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. ఇటు మరణాల సంఖ్య భారీగానే ఉండటంతో రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా గోదారి జిల్లాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments