Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ.. 7,998 మందికి పాజిటివ్

Webdunia
గురువారం, 23 జులై 2020 (19:31 IST)
కరోనా వైరస్ ఏపీలో విజృంభిస్తోంది. రోజురోజుకూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయే తప్పితే తగ్గే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. అయితే పెద్ద సంఖ్యలో కరోనా టెస్ట్‌లు చేస్తున్నా.. భారీగానే కేసులు నమోదవుతున్నాయని వైద్య శాఖాధికారులు చెబుతున్నారు. గురువారం నాడు మొత్తం 58,052 మందికి కరోనా పరీక్షలు చేయగా 7,998 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 
 
కాగా గురువారం నమోదైన కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో భారీగా 1391 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 1184, అనంతపురంలో 1016 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 904 కేసులు, పశ్చిమ గోదావరిలో 748 కేసులు నమోదయ్యాయి. మొత్తానికి చూస్తే.. కోస్తాంధ్రలో గోదావరి జిల్లాల్లో, గుంటూరు, విశాఖపట్నంలో.. రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి.
 
ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 884 మంది మృతి చెందారు. మొత్తానికి చూస్తే.. అటు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. ఇటు మరణాల సంఖ్య భారీగానే ఉండటంతో రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా గోదారి జిల్లాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments