Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 12 మంది మృతి

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (18:47 IST)
ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,746 శాంపిల్స్‌ పరీక్షించగా.. 864 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. మరో 12 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.
 
చిత్తూరులో నలుగురు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 1,310 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
 
తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,73,63,641కు చేరుకున్నాయి.. ఇక, పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,30,849కు పెరిగితే.. కోలుకున్నవారి సంఖ్య 20,02,187కు చేరుకుంది.
 
మరోవైపు ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 14,010కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,652 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్‌. ఇక, తాజా కేసుల్లో అత్యధికంగా నెల్లూరులో 141, తూర్పు గోదావరి జిల్లాలో 135, కడరపలో 117, ప్రకాశం జిల్లాలో 114, చిత్తూరులో 101 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments