Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్యం ఆందోళనకరం : వైద్యులు వెల్లడి

Webdunia
ఆదివారం, 21 మే 2023 (10:53 IST)
అనారోగ్యంపాలైన కడప వైకాపా ఎంపి అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి గుండె వైద్య నిపుణులు డాక్టర్ హితేష్ రెడ్డి వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం చేసిన పరీక్షలో ట్రోపోనిన్ పాజిటివ్ వచ్చిందని.. అది గుండెపోటు వచ్చే అవకాశాన్ని సూచిస్తోందన్నారు. 
 
అందువల్ల యాంజియోగ్రామ్ నిర్వహించగా ఆమెకు రెండు నరాల్లో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. రక్తపోటు తక్కువగా ఉందని, అది సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే ఆమెకు ఎలాంటి వైద్యం అందించాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 
 
ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని, మరికొన్ని రోజులపాటు ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. అవినాష్ తల్లి లక్ష్మమ్మ విశ్వభారతి ఆసుపత్రిలో నాలుగో అంతస్తులోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన అయిదో అంతస్తులో ఉండి తల్లి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments