Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు ముక్కల రాజధానిపై ప్రత్యేక తీర్మానం ఎందుకు చేశారు?

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (10:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేస్తూ అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం చేసింది. నిజానికి అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెట్టి దాన్ని సంపూర్ణ మెజార్టీతో ఆమోదించింది. అదేసమయంలో ప్రత్యేక తీర్మానం చేయడం జరిగింది. ఇలాంటి తీర్మానం ఎందుకు చేశారన్న అంశంపైనే ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. 
 
తాము అనుకున్నట్లుగా, ఎలాంటి ఆలస్యం లేకుండా మూడు రాజధానుల నిర్ణయం అమలయ్యేందుకు ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే... బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ, దీనికి శాసన మండలిలో చుక్కెదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్టు భావిస్తోంది. ఎందుకంటే మండలిలో విపక్ష పార్టీలకే పూర్తి బలం ఉంది. 
 
ఇక్కడ బిల్లు వీగిపోతే అపుడు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సి వస్తుంది. చట్టసభల్లో బిల్లును ఆమోదించుకోలేక, ఆర్డినెన్స్‌ తేవాల్సి రావడం సర్కారుకు అప్రతిష్టగా భావిస్తారు. మండలిలో ఈ బిల్లు భవిష్యత్తు ఏమవుతుందన్న దానిపై సర్కారుకు సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానులపై ఒక తీర్మానాన్ని ఆమోదించేశారు. మండలిలో బిల్లు అటూఇటు అయినప్పటికీ... అసెంబ్లీ తీర్మానం ఆధారంగా రాజధాని తరలింపును ప్రారంభిస్తారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments