Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు ముక్కల రాజధానిపై ప్రత్యేక తీర్మానం ఎందుకు చేశారు?

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (10:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేస్తూ అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం చేసింది. నిజానికి అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెట్టి దాన్ని సంపూర్ణ మెజార్టీతో ఆమోదించింది. అదేసమయంలో ప్రత్యేక తీర్మానం చేయడం జరిగింది. ఇలాంటి తీర్మానం ఎందుకు చేశారన్న అంశంపైనే ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. 
 
తాము అనుకున్నట్లుగా, ఎలాంటి ఆలస్యం లేకుండా మూడు రాజధానుల నిర్ణయం అమలయ్యేందుకు ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే... బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ, దీనికి శాసన మండలిలో చుక్కెదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్టు భావిస్తోంది. ఎందుకంటే మండలిలో విపక్ష పార్టీలకే పూర్తి బలం ఉంది. 
 
ఇక్కడ బిల్లు వీగిపోతే అపుడు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సి వస్తుంది. చట్టసభల్లో బిల్లును ఆమోదించుకోలేక, ఆర్డినెన్స్‌ తేవాల్సి రావడం సర్కారుకు అప్రతిష్టగా భావిస్తారు. మండలిలో ఈ బిల్లు భవిష్యత్తు ఏమవుతుందన్న దానిపై సర్కారుకు సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానులపై ఒక తీర్మానాన్ని ఆమోదించేశారు. మండలిలో బిల్లు అటూఇటు అయినప్పటికీ... అసెంబ్లీ తీర్మానం ఆధారంగా రాజధాని తరలింపును ప్రారంభిస్తారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments