Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇష్టం లేదు.. పైనుంచి వచ్చిన ఆదేశాలతో ర్యాలీలు - జగన్ ఫోటోలకు పాలాభిషేకం

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (13:55 IST)
రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేయాలని సీఎం జగన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని, ఆ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించుకున్న విషయం తెల్సిందే. కానీ, ఇదే బిల్లుకు శాసనమండలిలో తెదేపా బ్రేక్ వేసింది. ఈ తాజా పరిణామాలపై విశాఖ జిల్లా వైకాపా నేతలు తమ మనోగతాన్ని వెల్లడించారు. 
 
మూడు రాజధానుల ఏర్పాటు తమ పార్టీలో కొంతమందికి ఇష్టం లేదని, అయినప్పటికీ పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ర్యాలీలు నిర్వహించి, సీఎం జగన్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నామని ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన మరో నేత వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కొన్ని ప్రాంతాలకు అనుకూలంగా, మరికొన్ని ప్రాంతాలకు వ్యతిరేకంగా వుండవచ్చని, కానీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ప్రజాప్రతినిధులకు కూడా ఇవ్వడం లేదని కొద్దిరోజుల క్రితం వైసీపీలో చేరిన నర్సీపట్నం నాయకుడొకరు వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా, ప్రభుత్వం కూడా తాను తీసుకోబోయే నిర్ణయాలపై పార్టీ నేతల అభిప్రాయాలు, మనోగతాన్ని తెలుసుకోవడంలేదని, ఇది తమ పార్టీతోపాటు ప్రతిపక్షంలోనూ వుందని నిర్వేదంతో చెప్పారు. ఏ పార్టీ వారైనా సరే అధిష్టానం నుంచి వచ్చే ఆదేశాలను పాటించడం, షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాలను నిర్వహించడం తప్ప వాటిని కాదనే పరిస్థితి లేదని వారు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments