Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయసాయి ఆధీనంలోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు విముక్తి

సెల్వి
సోమవారం, 5 ఆగస్టు 2024 (22:54 IST)
ఎట్టకేలకు వైకాపా సీనియర్ నేత విజయసాయిరెడ్డి కుటుంబ ఆధీనం నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కి విముక్తి లభించింది. 2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఏసీఏను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పుడు వైసీపీ గద్దె దించడంతో ఆ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు రాజీనామా చేశారు. 
 
వీరి రాజీనామాలను ఏసీఏ సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు. విజయవాడలోని ఓ హోటల్‌లో సర్వసభ్య సమావేశం జరిగింది. ఎసిఎ అధ్యక్షుడు పి.శరత్‌చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు పి.రోహిత్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఎస్‌ఆర్‌ గోపీనాథ్‌రెడ్డితో పాటు మరికొంతమంది రాజీనామాలను సమావేశంలో ఆమోదించారు.
 
అలాగే ఏసీఏ కోసం కొత్త మేనేజ్‌మెంట్ బాడీని సెప్టెంబర్ 8న ఎన్నుకోనున్నారు. కొత్త ఆర్గనైజింగ్ బాడీ ఎన్నిక వరకు ఏసీఏ నిర్వహణ కోసం ముగ్గురు సభ్యుల కమిటీని కేటాయించారు. త్రిసభ్య కమిటీలో ఆర్‌విఎస్‌కె రంగారావు (విజయనగరం), మాంచో ఫెర్రర్ (అనంతపురం), జె.మురళీమోహన్ (గుంటూరు) సభ్యులుగా నియమితులయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments