Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు కొలువుదీరనున్న ఏపీ మంత్రివర్గం.. జగన్ టీమ్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (11:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం శనివారం కొలువుదీరనుంది. సచివాలయంలో జరిగే కార్యక్రమంలో మంత్రులతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకోసం నరసింహన్ శుక్రవారం సాయంత్రానికి హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకోనున్నారు. 
 
అయితే, జగన్ మంత్రివర్గంలో ఐదుగురు నేతలకు ఉప ముఖ్యమంత్రులు దక్కే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వీరిలో ఆళ్ళ నాని (కాపు), కె.పార్థసారథి (యాదవ్), రాజన్న దొర (ఎస్టీ), ఆంజాద్ బాషా (మైనార్టీ), సుచరిత (ఎస్సీ)లను ఉప ముఖ్యమంత్రులుగా నియమించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఇదిలావుంటే జగన్ మంత్రివర్గంలో 25 మందికి చోటు కల్పించనున్నాట్టు సమాచారం. ఈ మంత్రివర్గాన్ని అనుభవజ్ఞులతో కొత్తవారితో ఏర్పాటు చేయనున్నారు. శనివారం ఏర్పాటయ్యే మంత్రివర్గం రెండున్నరేళ్ళ పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత కొత్తవారికి అవకాశం ఇస్తామని జగన్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు కూడా. కాగా, మే 30వ తేదీన నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments