Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాగులో చిక్కుకున్న 20 మంది కూలీలను కాపాడిన పెద్దపప్పూరు పోలీసులు

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (14:37 IST)
వ‌ర‌ద బీభ‌త్సంలో ఎన్నో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తుపాను ఎంతో మందిని పొట్ట‌ను ప‌ట్టుకోగా, చాలా మందిని అధికార యంత్రాంగం కాపాడుతోంది. అనంత‌పురం జిల్లాలో వాగు ఉధృతిలో చిక్కుకున్న 20 మంది కూలీలను పెద్దపప్పూరు పోలీసులు కాపాడారు.
 
 
పెద్దపప్పూరు మండల పరిధిలోని జోడి ధర్మాపురం గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాద స్థాయిలో వాగు ప్రవహిస్తుండంతో, పోలీసులు గుర్తించి ఆ రహదారి గుండా ఎవరూ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలు వేశారు. అవేమీ పట్టించుకోకుండా 20 మంది కూలీలతో ఐచర్ వాహనం వాగు దాటేందుకు ప్రయత్నించింది. వాగులో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఐచర్ వాహనం  చిక్కుకుంది. కూలీలు  హహాకారాలు చేయడంతో గ్రామస్తులు పెద్దపప్పూరు పోలీసులకు విషయం తెలియజేశారు. 
 
 
వెంటనే స్పందించిన ఎస్సై మహమ్మద్ గౌస్ హిటాచిని తీసుకుని తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తానే స్వయంగా వాహనం మీద కూర్చుని వాగు లోకి వెళ్లి.ఒక్కొక్క మహిళను హిటాచిలోకి జాగ్రత్తగా లాక్కుని, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పెద్దపప్పూరు పోలీసుల సహాయక చర్యలను గ్రామ‌స్తులు అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments