Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాగులో చిక్కుకున్న 20 మంది కూలీలను కాపాడిన పెద్దపప్పూరు పోలీసులు

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (14:37 IST)
వ‌ర‌ద బీభ‌త్సంలో ఎన్నో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తుపాను ఎంతో మందిని పొట్ట‌ను ప‌ట్టుకోగా, చాలా మందిని అధికార యంత్రాంగం కాపాడుతోంది. అనంత‌పురం జిల్లాలో వాగు ఉధృతిలో చిక్కుకున్న 20 మంది కూలీలను పెద్దపప్పూరు పోలీసులు కాపాడారు.
 
 
పెద్దపప్పూరు మండల పరిధిలోని జోడి ధర్మాపురం గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాద స్థాయిలో వాగు ప్రవహిస్తుండంతో, పోలీసులు గుర్తించి ఆ రహదారి గుండా ఎవరూ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలు వేశారు. అవేమీ పట్టించుకోకుండా 20 మంది కూలీలతో ఐచర్ వాహనం వాగు దాటేందుకు ప్రయత్నించింది. వాగులో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఐచర్ వాహనం  చిక్కుకుంది. కూలీలు  హహాకారాలు చేయడంతో గ్రామస్తులు పెద్దపప్పూరు పోలీసులకు విషయం తెలియజేశారు. 
 
 
వెంటనే స్పందించిన ఎస్సై మహమ్మద్ గౌస్ హిటాచిని తీసుకుని తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తానే స్వయంగా వాహనం మీద కూర్చుని వాగు లోకి వెళ్లి.ఒక్కొక్క మహిళను హిటాచిలోకి జాగ్రత్తగా లాక్కుని, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పెద్దపప్పూరు పోలీసుల సహాయక చర్యలను గ్రామ‌స్తులు అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments