Webdunia - Bharat's app for daily news and videos

Install App

సగం భూమి రాసిస్తే ఆన్‌లైన్‌లో ఎక్కిస్తా.. రైతుకు వీఆర్వో బెదిరింపు

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (13:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ అధికారుల తీరు ఏమాత్రం బాగోలేదు. ‘పట్టాదారు పాసుపుస్తకం, 1బీకి సంబంధించి పేరు ఆన్‌లైన్‌లో ఎక్కించాలని పలు దఫాలుగా అర్జీలు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఓ వీఆర్వోను సంప్రదించగా భూమిలో సగం నేను చెప్పిన వాళ్లకు రాసిస్తే.. ఆన్‌లైన్‌లో తక్షణమే ఎక్కించి పట్టాదారు పాసుపుస్తకం ఇస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఈ విషయాన్ని ఓ బాధిత రైతు అనంతపురం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. 
 
సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా బాధితుడు, కదిరికి చెందిన ఆలం నవాజ్‌ మాట్లాడుతూ తనకు పిత్రార్జితంగా సర్వే నంబరు 175-4లో 1.02 ఎకరాల భూమి వచ్చింది. ఆ భూమికి పట్టాదారు పాసుపుస్తకం కోసం అనేక దఫాలుగా కదిరి రెవెన్యూ అధికారులకు అర్జీలు ఇచ్చినట్లు తెలిపారు. అయితే వీఆర్వో నరసింహారెడ్డి అడ్డుపడుతున్నారని, సగం భూమి తాను చెప్పిన వాళ్లకు రాసిస్తేనే పనిచేస్తాం. లేకపోతే చేయం. నీఇష్టమొచ్చిన వారికి చెప్పుకో అంటూ బెదిరిస్తూ.. మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితుడు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. 
 
దీంతో వెంటనే కలెక్టర్‌ స్పందించారు. కదిరి ఉప తహసీల్దారుతో బాధితుడితోనే వీసీ ద్వారా మాట్లాడించారు. అనంతరం కలెక్టరు అధికారులపై మండిపడ్డారు. తమాషా చేస్తున్నారా? భూమికి పట్టాదారు పాసుపుస్తకం, ఆన్‌లైన్‌లో ఎక్కించడానికి భూమి ఇవ్వాలా? బాధితుడి సమస్య తక్షణమే పరిష్కరించి, తనకు నివేదించాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే ఉద్యోగం ఊడుతుందని వీఆర్వోను హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments