Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంజనేయ స్వామి సాక్షిగా అమ్మాయిపై బ్లేడుతో దాడి

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (14:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలో దారుణం జరిగింది. ఈ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా వి.మాడుగులలో ఓ ఉన్మాది ఒక యువతిని బ్లేడుతో గొంతు కోశారు. ఈ ఘటన స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వి.మాడుగుల గ్రామానికి చెందిన నగేశ్ అనే ఉన్మాది ఓ యువతి వెంటబడి ప్రేమిస్తున్నాంటూ వేధించసాగాడు. అయితే, ఆ యువతి నగేశ్ ప్రేమను తిరస్కరించింది. దీంతో కక్ష పెంచుకున్న నగేశ్ ఆ యువతి తనకు దక్కకుంటే మరెవ్వరికీ దక్కకూడదన్న ప్రతీకారంతో రగిలిపోయాడు. 
 
ఈ క్రమంలో సోమవారం ఉదయం స్థానికంగా ఉండే ఆంజనేయ స్వామి గుడికి వెళ్లిన ఆ యువతిని అనుసరించిన ఉన్మాది నగేశ్... అప్పటికే పక్కా ప్రణాళికతో తన వద్ద ఉన్న బ్లేడుతో ఆ యువతిపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన స్థానికులు బాధిత యువతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
గతంలో కూడా ఈ యువతిపై నగేశ్ ఇదే విధంగా దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే, అపుడు పోలీసులు నగేశ్‌కు వార్నింగ్ ఇచ్చి వదిలివేశారు. ఇపుడు ఏకంగా ఆ యువతిపై బ్లేడుతో దాడిచేశాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments