Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంజనేయ స్వామి సాక్షిగా అమ్మాయిపై బ్లేడుతో దాడి

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (14:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలో దారుణం జరిగింది. ఈ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా వి.మాడుగులలో ఓ ఉన్మాది ఒక యువతిని బ్లేడుతో గొంతు కోశారు. ఈ ఘటన స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వి.మాడుగుల గ్రామానికి చెందిన నగేశ్ అనే ఉన్మాది ఓ యువతి వెంటబడి ప్రేమిస్తున్నాంటూ వేధించసాగాడు. అయితే, ఆ యువతి నగేశ్ ప్రేమను తిరస్కరించింది. దీంతో కక్ష పెంచుకున్న నగేశ్ ఆ యువతి తనకు దక్కకుంటే మరెవ్వరికీ దక్కకూడదన్న ప్రతీకారంతో రగిలిపోయాడు. 
 
ఈ క్రమంలో సోమవారం ఉదయం స్థానికంగా ఉండే ఆంజనేయ స్వామి గుడికి వెళ్లిన ఆ యువతిని అనుసరించిన ఉన్మాది నగేశ్... అప్పటికే పక్కా ప్రణాళికతో తన వద్ద ఉన్న బ్లేడుతో ఆ యువతిపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన స్థానికులు బాధిత యువతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
గతంలో కూడా ఈ యువతిపై నగేశ్ ఇదే విధంగా దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే, అపుడు పోలీసులు నగేశ్‌కు వార్నింగ్ ఇచ్చి వదిలివేశారు. ఇపుడు ఏకంగా ఆ యువతిపై బ్లేడుతో దాడిచేశాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments