Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెద్ద పార్టీయే కావొచ్చు.. రాష్ట్రంలో తుస్సే : బీజేపీపై అంబటి విసుర్లు

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (11:28 IST)
భారతీయ జనతా పార్టీపై వైకాపా నేత, మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ దేశంలో పెద్ద పార్టీయే కావొచ్చు కానీ రాష్ట్రంలో మాత్రం తుస్సేనని చెప్పారు. ఆత్మకూరు అసెంబ్లీకి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ బరిలో లేదని అందుకే బీజేపీ నేతలు రోడ్లపై కనిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. 
 
ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో అంబటి రాంబాబు మాట్లాడుతూ, బీజేపీ నేతలు ప్రచారం కోసమే తనపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పైగా, టీడీపీ బరిలో లేదు కాబట్టే బీజేపీ నేతలు కనిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. 
 
ప్రచారం పొందాలన్న ఉబలాటంతోనే తనను ఏదో ఒకటి అంటున్నారని అంబటి వ్యాఖ్యానించారు. ప్రజాధనంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీ వచ్చేలా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వైకాపా కార్యకర్తలు రప్పించాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments