Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సీఎం ఇంటిపై దాడికి తెగబడిన వైకాపా కార్యకర్తలు

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (13:27 IST)
ఏపీలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై అధికార వైకాపాకు చెందిన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు నానా హంగామా చేశారు. 
 
అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పలని గొడవకు దిగారు. లోపలికి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో పెద్దపెద్ద రాళ్లు, కట్టెలతో దాడులకు పూనుకున్నారు. ఈ దాడిలో పలువురు టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే జోగి రమేష్ సమక్షంలో ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర చూస్తూ మిన్నకుండిపోయారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
 
మరోవైపు, చంద్రబాబు ఇంటిపై దాడి జరుగుతుందని తెలుసుకున్న అమరావతి పోరాట సమితి రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. జెడ్ క్యాటగిరీ ఉన్న చంద్రబాబుపైనే దాడికి దిగుతుంటే.. ఇక సామాన్యల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఈ దాడిని పోలీసులే ప్రోత్సహించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ దగ్గరుండి మరీ వైసీపీ నేతలను బాబు ఇంటి వద్దకు పంపారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments