Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం గారు వెళ్లాకే భోజనం చేయాలి.. మందడం గ్రామస్తులకు ఖాకీల ఆంక్షలు

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (11:36 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిగారు సచివాలయంలో ఉన్నారు. ఆయన వెళ్లేంత వరకు మందుల షాపులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తెరవరాదు. అంతేకాదు.. ఆయన కాన్వాయ్ వెళ్లిన తర్వాతే మీరంతా భోజనాలు చేయాలి. ఇది మందడం గ్రామవాసులకు పోలీసులు ఇచ్చిన వార్నింగ్. ఈ హెచ్చరికలతో గ్రామస్తులు బెంబేలెత్తిపోయారు. 
 
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం అమరావతికి రానున్నారు. దీంతో మందడం గ్రామంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటుచేశారు. మందుల షాపులతో పదుకాణాలను అన్నింటినీ మూసివేయిస్తున్నారు. మెడికల్ షాపులతో పాటు ప్రాథమిక ఆరోగ్యం, ఇతర షాపులన్నీ తెరచేందుకు వీల్లేదన్న ఆంక్షలు జారీ అయ్యాయి. 
 
అంతేకాకుండా, ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వెళ్లేన తర్వాతే భోజనాలు చేయాలని పోలీసులు నిబంధన విధించారు. హోటళ్లను కూడా తెరవనీయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఐడీ, ఆధార్ కార్డులను తనిఖీలు చేస్తున్నారని అంటున్నారు. 
 
అయితే, పోలీసులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే మార్గం కావడంతోనే మందడం ప్రధాన రహదారిని తమ అధీనంలో ఉంచుకోవాల్సి వస్తోందని, ఈ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసేందుకే ఆంక్షలను అమలు చేస్తున్నామని చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments