Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం గారు వెళ్లాకే భోజనం చేయాలి.. మందడం గ్రామస్తులకు ఖాకీల ఆంక్షలు

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (11:36 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిగారు సచివాలయంలో ఉన్నారు. ఆయన వెళ్లేంత వరకు మందుల షాపులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తెరవరాదు. అంతేకాదు.. ఆయన కాన్వాయ్ వెళ్లిన తర్వాతే మీరంతా భోజనాలు చేయాలి. ఇది మందడం గ్రామవాసులకు పోలీసులు ఇచ్చిన వార్నింగ్. ఈ హెచ్చరికలతో గ్రామస్తులు బెంబేలెత్తిపోయారు. 
 
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం అమరావతికి రానున్నారు. దీంతో మందడం గ్రామంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటుచేశారు. మందుల షాపులతో పదుకాణాలను అన్నింటినీ మూసివేయిస్తున్నారు. మెడికల్ షాపులతో పాటు ప్రాథమిక ఆరోగ్యం, ఇతర షాపులన్నీ తెరచేందుకు వీల్లేదన్న ఆంక్షలు జారీ అయ్యాయి. 
 
అంతేకాకుండా, ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వెళ్లేన తర్వాతే భోజనాలు చేయాలని పోలీసులు నిబంధన విధించారు. హోటళ్లను కూడా తెరవనీయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఐడీ, ఆధార్ కార్డులను తనిఖీలు చేస్తున్నారని అంటున్నారు. 
 
అయితే, పోలీసులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే మార్గం కావడంతోనే మందడం ప్రధాన రహదారిని తమ అధీనంలో ఉంచుకోవాల్సి వస్తోందని, ఈ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసేందుకే ఆంక్షలను అమలు చేస్తున్నామని చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments