Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఎన్‌యూలో నోరెత్తని దీపికా పదుకునే.. సినిమాలను బహిష్కరించాలని..?! (video)

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (11:21 IST)
ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునే మంగళవారం రాత్రి దేశ రాజధానిలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) లో జరిగిన దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. జేఎన్‌యూకి వెళ్లిన దీపిక దాదాపు 15 నిమిషాలపాటు విద్యార్థులతో గడిపారు. కానీ ఏమాత్రం నోరు విప్పకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. దీపిక వర్సిటీని సందర్శించిన సమయంలో జేఎన్‌యూ ఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కూడా అక్కడే ఉన్నారు.
 
మంగళవారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఆమె యూనివర్సిటీకి వచ్చారు. జేఎన్‌యూ ఎస్‌యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్‌ను ఆమె పరామర్శించారు. ఆ తర్వాత మరి కొంతమంది విద్యార్థులను కలిసి మాట్లాడారు. దీపికా పదుకొనె జేఎన్‌యూను సందర్శించిన నేపథ్యంలో బీజేపీ నేత తేజేందర్ సింగ్ బగ్గా ఆమెపై తీవ్రంగా స్పందించారు. టుక్డే టుక్డే గ్యాంగ్, అఫ్జల్ గ్యాంగ్‌కు మద్దతు పలుకుతున్న దీపికా పదుకొనె సినిమాలను బహిష్కరించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆయనతోపాటు పలువురు బీజేపీ నేతలు కూడా ఆమెపై మండిపడుతున్నారు. 
 
కాగా, ఆదివారం సాయంత్రం కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి జేఎన్‌యూ ప్రవేశించి.. పలువురు విద్యార్థులతోపాటు ప్రొఫెసర్లపైనా దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంగతి తెలిసిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments