Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీది ఏ ఊరు.. గుర్తింపు కార్డు లేదా? ఊర్లోకి అనుమతిలేదు : పోలీసులు

Webdunia
ఆదివారం, 23 ఆగస్టు 2020 (12:29 IST)
నవ్యాంధ్ర రాజధాని కోసం తమ పంటభూములిచ్చిన అమరాతి ప్రాంత రైతులను పోలీసులు ఏపీ పోలీసులు ఓ ఆట ఆడుకుంటున్నారు. రాజధానిని తరలించవద్దంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారానికి 250 రోజుకు చేరాయి. ఈ క్రమంలో ఆదివారం రాజధాని రణభేరి పేరుతో రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలు చేయనున్నారు. 
 
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. కరోనా సమయంలోను నిరసనలు హోరెత్తుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళల నిరసనలు సాగుతున్నాయి. 
 
మందడం, తుళ్లూరు, వెలగపూడి, ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం, దొండపాడు, పెదపరిమి, నెక్కళ్ళు, పొన్నెకళ్ళు, కిష్టయపాలెం, ఎర్రబాలెం, వెంకటపాలెం, రాయపూడి, తాడికొండ అడ్డరోడ్డు, నేలపాడు, ఐనవోలు, శాఖమూరు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
 
మరోవైపు, రాజధాని ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గుర్తింపు కార్డులు ఉంటేనే గ్రామాల్లోకి పోలీసులు అనుమతిస్తున్నారు. ఎక్కడిక్కడ వాహనాలను పూర్తిస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతి ఇస్తున్నారు. గుర్తింపు కార్డు లేనివారిని లోపలకు అనుమతించడంలేదు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments