Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల త్యాగం వృధాకారాదు : నాగబాబు

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (16:03 IST)
నవ్యాంధ్రకు రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై అమరావతి రైతులు దీక్షకు దిగారు. మందడంలో జరిగిన ఈ దీక్షకు జనసేన నేత, సినీనటుడు నాగబాబుతో పాటు.. ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తమ సంఘీభావం తెలుపుతూ దీక్షలో కూర్చొన్నారు. 
 
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులు తమ కుటుంబాలతో పాటు రోడ్డుపైకి వచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల పోరాటానికి తాను మద్దతు తెలుపుతున్నానని చెప్పారు. అమరావతిలో రాజధానిని యథాతథంగా కొనసాగించాలన్నదే జనసేన డిమాండ్ అని నాగబాబు తెలిపారు. 
 
గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలను వైసీపీ సర్కారు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతుల కష్టాల పరిష్కారం కోసం పోరాడేందుకు తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన చెప్పారు.
 
ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రైతులకు న్యాయం జరిగేవరకు అండగా ఉంటామన్నారు. రైతులకు రాజకీయ రంగు ఎందుకు పులుముతున్నారని, రైతుల కులాల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని కోసం అమరావతి రైతులు తమ భూములను త్యాగం చేశారని, రాజధాని రైతుల సమస్యలు తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు బాగా తెలుసన్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం రైతులను గౌరవించాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. 70 శాతం రైతులు ఐదు ఎకరాల లోపు భూములు ఉన్నవారేనని, రైతులకు తాము అండగా ఉంటామని చెప్పారు. అధికారం ఉందని రైతులను బాధపెట్టడం సరికాదని అన్నారు. 
 
రాజధానిపై ప్రభుత్వం వేసిన కమిటీలోని సభ్యులు ఎన్నడైనా అమరావతికి వచ్చారా? రైతుల అభిప్రాయాలను తీసుకున్నారా? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నలు సంధించారు. ప్రజలకు నష్టం కలిగేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments