Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క రైతుకు 50 మంది పోలీసుల రక్షణ... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (09:33 IST)
మూడు రాజధానుల పేరుతో రాజధాని అమరావతిని విధ్వంసం చేసిన వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రాంత రైతులు అంటే హడలిపోతున్నారు. దీంతో తాను ప్రయాణించే మార్గంలో వందల, వేల సంఖ్యలో పోలీసులను రోడ్డుకు ఇరువైపులా మొహరించి, ఆ తర్వాత తన కాన్వాయ్ సురక్షితంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రోడ్డు పక్కన ఊత కర్రతో నిలబడివున్న ఓ రైతుకు కాపలాగా 50 మంది పోలీసులు ఉన్న ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 
ఆ వృద్ధుడు సరిగ్గా నడవలేడు. చేతికర్ర లేనిదే అడుగు తీసివేయలేడు. అలాంటి రైతును చూసినా సీఎం జగన్‌కు హడల్. ఆ రైతు చుట్టూ 50 మంది పోలీసులు నిల్చొన్నారు. దీనికి కారణం.. ఆయన అమరావతి రైతు. ఆయన నిలబడిన చోటు దీక్షాశిబిరం. 50 మందికిపైగా పోలీసులు ఆ రైతు ముందు గోడలా నిలబడితే.. వెనుక నుంచి కార్ల కాన్వాయ్‌లో సీఎం జగన్ వెళ్లారు. 
 
రాజధానిని మూడు ముక్కలాట చేసి అమరావతికి కోసం భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడలేక, వారి సమస్య పరిష్కరించలేక రాజకీయ క్రీడ ఆడుతున్న సీఎం ఇలా పోలీసుల మాటున దాటిపోతున్నారు. ఈ పరిస్థితి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం దీక్షా శిబిరం వద్ద కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments