Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో మ‌హాపాద యాత్ర‌కు బ్రేక్! రాజధాని రైతులకు సోమిరెడ్డి పలకరింపు

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (11:34 IST)
భారీ వర్షాల కార‌ణంగా అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల‌ పాద యాత్రకు బ్రేక్ ప‌డింది. రాజ‌ధాని టు తిరుమ‌ల దేవ‌స్థానం యాత్ర‌కు విరామం ప్రకటించి నెల్లూరు నగరంలోని అంబాపురం శాలివాహన ఫంక్షన్ హాలులో విశ్రాంతి తీసుకుంటున్న రైతులను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, త‌దుప‌రి యాత్ర వివ‌రాలు అడిగారు.
 
 
అమరావతికి మద్దతుగా కళాకారులు చేసిన ప్రదర్శనలను తిలకించి వారిని అభినందించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల‌ రాజధానిగా అమరావతి కొనసాగాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామ‌ని చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. రైతుల త్యాగం వృథా కాబోదని, ప్రజలందరి ఆశీస్సులు, భగవంతుని దీవెనలతో రాజధానిగా అమరావతి కొనసాగుతుందని స్పష్టం చేశారు.


ఇటీవ‌ల కోర్టు తీర్పుల‌కు భ‌య‌ప‌డి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం, మూడు రాజ‌ధాని బిల్లుల‌ను ఉప‌సంహ‌రించుకుంద‌ని, మ‌ళ్ళీ దీనిపై ఏదైనా ప్ర‌య‌త్నం చేస్తే, రాష్ట్ర ప్ర‌జ‌లు ఊరుకోర‌ని అన్నారు. ఈ సారి ఈ ఉద్య‌మం మ‌రింత పెద్ద‌దిగా  మారుతుంద‌ని, ప్ర‌జా ఉద్య‌మంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం కొట్టుకుపోతుంద‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments