Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

ఠాగూర్
మంగళవారం, 21 మే 2024 (18:42 IST)
అమలాపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళ కడుపు నుంచి వైద్యులు ఏకంగా 570 రాళ్లు తొలగించారు. ఈ రాళ్లను చూసిన  వైద్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ అపరేషన్ అమలాపురం ఏఎస్ఏ ఆస్పత్రిలో చేశారు. ప్రస్తుతం బాధిత మహిళ కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ఇటీవల ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ చేసి మహిళ కడుపులో నుంచి 570 రాళ్లను తొలగించారు. ఈ అరుదైన ఆపరేషన్‌ను అమలాపురంలోని ఏఎస్ఏ ఆసుపత్రి వైద్యులు నిర్వహించారు. ఈ నెల 18వ తేదీన ఆపరేషన్ చేయగా, ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటుంది. 
 
ఈ అరుదైన ఆపరేషన్ వివరాలను ఏఎస్ఏ ఆస్పత్రి వైద్యులు మీడియాతో మాట్లాడుతూ, కోనసీమ జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన జాలెం నరసవేణి (31) అనే మహిళ గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుంది. భోజనం చేశాక నొప్పి ఎక్కువగా అవుతుండటంతో భరించలేక వైద్యులను ఆశ్రయించింది. దేవగుప్తం ఆస్పత్రిలో చూపించుకోగా, అక్కడి వైద్యులు అమలాపురంలోని ఏఎస్ఏ ఆస్పత్రి రిఫర్ చేశారు. నరసవేణిని పరీక్షించిన ఏఎస్ఏ వైద్యులు స్కానింగ్‌లో గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్‌ చేసి వాటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. డాక్టర్ నర్రా శ్రీనివాసులు, డాక్టర్ అంజలి నేతృత్వంలోని ఈ నెల 18వ తేదీన అరుదైన ఆపరేషన్ నిర్వహించి పేషెంట్ నరసవేణి గాల్ బ్లాడర్‌‍ నుంచి 570 రాళ్ళను వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments