Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

ఠాగూర్
మంగళవారం, 21 మే 2024 (17:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడివున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా, అధికార వైకాపా చిత్తుగా ఓడిపోతుందని ఆయన మరోమారు చెప్పారు. జూన్ నాలుగో తేదీన ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి దిగ్భ్రాంతి కలిగించేలా ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇపుడు కూడా మరోమారు ఇదే మాట చెబుతున్నట్టు తెలిపారు. జూన్ నాలుగో తేదీన వెల్లడయ్యే ఫలితాలతో జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయిపోతుందన్నారు. 
 
ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయిందని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిక్సర్ కొట్టబోతున్నారని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో ఒక వ్యూహకర్తగా పదేళ్ల అనుభవం ఉందని, ఆ అనుభవంతో చెబుతున్నా ఏపీలో వైకాపా చిత్తుగా ఓడిపోబోతుంది అని ఆయన మరోమారు పునరుద్ఘాటించారు. దేశంలో ఎక్కడ ఎవరు గెలుస్తారు. ఎవరు ఓడిపోతారనేది తాను అంచనా వేయగలనని చెప్పారు. జగన్ పార్టీ విషయంలోనూ తన అంచనాలు తప్పవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments