Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ క్షణమైనా వైకాపాలోకి టీడీపీ అమలాపురం ఎంపీ

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (09:55 IST)
సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలైన వైకాపా, టీడీపీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, ఎంపీ విపక్ష వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో ఎంపీ కూడా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన పేరు రవీంధ్ర బాబు. అమలాపురం ఎంపీగా కొనసాగుతున్నారు. 
 
నిజానికి కొంతకాలం క్రితం వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అధికార టీడీపీలోకి ఫిరాయిస్తున్న వారు మాత్రమే కనిపించారు. కానీ, ఇపుడు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి చేరే వారి సంఖ్య ఎక్కువైంది. ఇటీవలే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌లు టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరడంతో రాష్ట్రంలో వలస రాజకీయాలు ఒక్కసారి ఊపందుకున్నాయి. 
 
తాజాగా, అమలాపురం లోక్‌సభ సభ్యుడు పండుల రవీంధ్రబాబు వైసీపీ వైపు చూస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారనున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాను పార్టీ మారడం లేదని ఆయన ఇటీవల వెల్లడించినప్పటికీ, కొంతకాలంగా వైసీపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతూనే ఉన్నారని తెలుస్తోంది. సో.. ఆయన కూడా ఏక్షణమైనా వైకాపాలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments