Webdunia - Bharat's app for daily news and videos

Install App

17ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. నగ్నంగా ఫోటోలు తీసి బెదిరింపులు.. తర్వాత..?

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (18:22 IST)
వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా బాలికపై లైంగిక దాడితో పాటు.. బెదిరింపులకు పాల్పడిన నిందితుడు, అతని స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. అమలాపురంకు చెందిన 17ఏళ్ల బాలిక పోటీ పరీక్షల శిక్షణ కోసం రాజమహేంద్ర వరం వెళ్లింది. అక్కడ ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చివరి ఏడాది చదువుతున్న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన మణి వెంకట సత్యనారాయణతో పరిచయమైంది. అలా ఓ రోజు బాలికను గుడికి రప్పించి మాట్లాడాడు. 
 
తన కోరికను తీర్చని పక్షంలో చంపేస్తానని బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై నగ్నచిత్రాలు తీసి బెదిరించాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని వేధిస్తూ వచ్చాడు. అతని ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో తల్లిదండ్రులకు బాధితురాలు ఈ విషయం తెలిపింది. 
 
వారి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. అలాగే నిందితుడికి సహకరించిన 15మంది స్నేహితులపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తారు. వీరిలో విద్యార్థినులు కూడా వున్నారని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం