Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అల్లు వర్ధంతి వేడుకలు : ఆ పేద రైతు వల్లే ఈ స్థాయిలో ఉన్నాం...

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (13:32 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో పేరెన్న‌ద‌గ్గ హాస్య న‌టుల్లో ఒకరు పద్మశ్రీ అల్లు రామ‌లింగ‌య్య ఒకరు. ఈయన హాస్య నటుల్లో ముందు వరుసలో ఉంటారు. ఎన్నో చిత్రాల్లో త‌న‌దైన అభిన‌యంతో ప్రేక్ష‌కుల మ‌దిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈయన గత 2004 జూలై 31వ తేదీన దివికేగారు. అయితే, ఈయన వర్థంతి వేడుకలు శుక్రవారం జూలై 31వ తేదీన జరుగుతున్నాయి. అల్లు వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ స‌భ్యులు, సినీ ప్రియులు ఆయ‌న్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్మ‌రించుకుంటున్నారు. 
 
ఇందులోభాగంగా, టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ 'ఇదే రోజు ఆయ‌న మ‌మ్మ‌ల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆరోజు నాకింకా గుర్తుంది. ఆరోజు కంటే ఆయ‌నేంటో, ఆయ‌న గొప్ప‌త‌న‌మేంటో ఈరోజు నాకు ఇంకా బాగా తెలుసు. నేను జీవితంలో ఎదుర్కొన్న అనుభ‌వాల కంటే, ఆయ‌న ఎఫ‌ర్ట్స్‌, ప్ర‌యాణం, ఆయ‌న ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌కు నేను బాగా క‌నెక్ట్ అయ్యాను. సినిమాల‌పై ఓ పేద రైతుకున్న ప్యాష‌న్ కార‌ణంగానే ఈరోజు మేమీ స్థాయిలో ఉన్నాం' అంటూ ట్వీట్ చేశారు. 
 
కాగా, అల్లు రామలింగయ్య 1922 అక్టోబరు ఒకటో తేదీన జన్మించగా, 2004 జూలై 31వ తేదీన చనిపోయారు. వచ్చే యేడాది అంటే 2021 నుంచి 2022ని శతజయంతి సంవత్సరంగా కొనియాడేందుకు అల్లు, మెగా ఫ్యామిలీలు ప్లాన్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments