Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిక్కుకోసం శానిటైజర్ తాగారు, మృత్యువులోకి జారుకున్నారు

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (13:22 IST)
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కురిచేడులో కిక్కుకోసం శానిటైజర్ తాగి ఏకంగా ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపుతోంది. వివరాలిలా వున్నాయి... కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర ఉండే నలుగురు యాచకులు, మరో నలుగురు గ్రామస్తులు మద్యానికి బానిసలయ్యారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించింది. దీంతో మద్యం ధరలు పెరిగాయి.
 
ఫలితంగా వారు గత కొద్దిరోజులుగా శానిటైజర్లు సేవిస్తున్నారట. గురువారం రాత్రి కడుపులో మంటతో ఓ వ్యక్తి చనిపోయాడు. మరో వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఇటు కురిచేడులో రమణయ్య శానిటైజర్‌తో పాటు నాటు సారా కలిపి తాగడంతో మరణించాడు.
 
అదే జిల్లాకు చెందిన ఐదుగురు మరణించారు. ఒకే యాచక బృందానికి చెందిన వీరంతా వేరువేరు ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మత్తుపై వీరికున్న మోజు మరణానికి దారితీసింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments